సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలలో విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే విధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా విద్యార్ధులు అందరికీ మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్ధి దశ నుండే దేశభక్తి ని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్ద్యంతో ఉన్న 563 స్క్రీన్స్ లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విద్యార్ధులను థియేటర్ లకు తీసుకెళ్ళే రవాణాఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రావిగుప్తా ను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, FDC ED కిషోర్ బాబు, UFO, క్యూబ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Related Posts
Spread the love హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో…
Spread the love భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి
Spread the love సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం…
Spread the love మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ…
Spread the love తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓటర్లకు కొన్ని సూచనలు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం…
Spread the love బుల్కాపూర్, చిన్న శంకర్పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ సాక్షిత శంకర్పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్…
Spread the love కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ…
Spread the love మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి .ఈ ప్రచారంలో పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్…
Spread the love పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవితఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ…