సాక్షిత : నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారుఉలను ఆదేశించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు పలు సమస్యలపై మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్య శాఖ కు చెందిన స్థలంలో అత్యాధునిక హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలను సిద్దం చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తో పాటి ఇతర నీటి వనరుల ద్వారా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి జరుగుతుందని, ఇక్కడ మార్కెట్ చేపల నిర్మాణం జరిగితే ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కూడా చేపట్టడం వలన పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని, తద్వారా ఈ ప్రాంతం మత్స్య రంగానికి ఒక హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే బేగంబజార్ లో హోల్ సేల్ చేపల మార్కెట్ ను ఎంతో అద్భుతంగా నిర్మించిన విషయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. కులవృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి లోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్నారు. ఆ ఆలోచనలలో భాగంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. వీటితో పాటు మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసిన ఫలితంగా రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించుకోవడానికి 800 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీ పై వివిధ రకాల వాహనాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవే కాకుండా అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాలలో అన్ని వసతులతో కూడిన చేపల మార్కెట్ ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. మత్స్యకారులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. అంతేకాకుండా తమ పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించి విద్యావంతులను చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ MLA ముఠా గోపాల్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేశిని మల్లయ్య పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.
Related Posts
Spread the love నామ నిధులతో గ్రౌండ్ లో వసతులునామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బీఆర్ ఎస్…
Spread the love గత కొన్ని సంవత్సరాల గా ఖమ్మం జిల్లా , ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని , శ్రీరామ్ నగర్, రోడ్ నెంబర్ 7 , ఏస్ బి ఐ బ్యాంక్ దగ్గర స్టడీ అబ్రాడ్ ఎం ఎం…
Spread the love జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు..…
Spread the love బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్… . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతు కై ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. శేరిలింగంపల్లి గడ్డ…
Spread the love పోలీసుల విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, భాధ్యతయుతమైన విధులు చాల కీలకంపోలీసు విధులు, విధివిధానాలపై ట్రైనీ కానిస్టేబుళ్ల ఇంట్రాక్షన్ మీట్ లో పోలీస్ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని…
Spread the love బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలినాకు యాదవులు మద్దతుగా నిలవాలియాదవులు మాటిస్తే వెనక్కిపోరుయాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత…
Spread the love ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్…
Spread the love టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ…
Spread the love కామారెడ్డి రూరల్ కార్యకర్తల సమావేశం మీటింగ్, కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజీకవర్గంకామారెడ్డి మండల BRS,BJP ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికకాంగ్రెస్…