SAKSHITHA NEWS

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..

సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు వైసీపీలో చేరారు, గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ కండువా కప్పి వీరందరిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇవాళ టీడీపీకి చెందిన 40 కుటుంబాలు వైసీపీలో చెరడం సంతోషంగా ఉందన్నారు.వీరందరికి రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వైసీపీలో చెరిన వారు మాట్లాడుతూ.. గత ముప్పై ఏళ్లుగా టీడీపీలో ఉన్నా తమకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. ఇవాళ జగన్ పార్టీలతో సంబంధం లేకుండా తమకు కూడా పథకాలు ఇవ్వడం చూసి ఆకర్షితులమై వైసీపీలో చేరడం జరిగింది అన్నారు. తమకు ఇంత మేలు చేస్తున్న జగన్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని అన్నారు. జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థలో తమ పిల్లలకు ఉద్యోగాలు కూడా వచ్చాయని వివరించారు. ఇవాళ తమ పిల్లలకు అమ్మఒడి కూడా వస్తుందని చెప్పారు. ఇంత గొప్ప ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరని కొనియాడారు కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాదర్ భాషా,ఖాజా,సీలార్,33వ వార్డు ఇన్ఛార్జ్ మర్రిపుడి రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS