SAKSHITHA NEWS

GHMC వార్డ్ కమిటీలను నియమించడంలో ప్రభుత్యం వైఫల్యం చెందింది..
సాక్షిత : భారత రాజ్యoగం ఆర్టికల్ 243 -S ప్రకారం స్థానిక సంస్థల హక్కులను ప్రభుత్యం కాలరాస్తుంది..

తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 Sec 17 ప్రకారం వార్డ్ కమిటీలను నియమించకుండా ప్రభుత్యం నీరుగారుస్తుంది..

వార్డ్ కమిటీలను నియమించకుండ చేసి తద్వారా GHMC నిధులను MLA లు అధికారులతో కలిసి పక్కదారి పట్టిస్తున్నారు.

ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే నిధులు వార్డ్ కమిటీలతో సంబంధం లేకుండా MLAలు వారి ఇష్టానుసారం వృధా చేస్తున్నారు..

తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 17 ప్రకారం మరియు భారత రాజ్యగం ఆర్టికల్ 243 -S ప్రకారం GHMC లో వార్డ్ కమిటీలను నియమించే విధంగా తెలంగాణ ప్రభుత్యాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర్య రాజన్ ని కలిసి వినతిపత్రం అందచేసిన మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకురాలు బొబ్బ నవత రెడ్డి.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యగం ఆర్టికల్ 243 -S ప్రకారం మరియు తెలంగాణ ప్రభుత్య మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 17 ప్రకారం GHMC స్థానిక సంస్థల హక్కులను,నియమ, నిబంధనలను నిర్వీర్యం చేస్తూ స్థానిక సంస్థల వార్డ్ కమిటీల ద్వారా ఖర్చు పెట్టవల్సిన అభివృద్ధి నిధులను MLA లు అధికారులతో కలిసి తమ ఇష్టారాజ్యంగా ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రజలకు అందవలసిన మౌళిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్యం అసెంబ్లీలో తాము చేసిన చట్టాన్ని తామే అమలు చేయకుండా, వార్డ్ కమిటీలను నియమించకుండా ప్రభుత్యం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. వెంటనే వార్డ్ కమిటీలను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరడం జరిగింది.

గవర్నర్ ను కలిసిన వారిలో చందానగర్ డివిజన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శోభ, మాజీ వార్డ్ మెంబర్ రమణ కుమారి, రాధిక తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS