SAKSHITHA NEWS

ధర్మపురి మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీనివాస్ అనే రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పెంజర విష సర్పం చేతికి కాటు వేసింది…

సాక్షిత జగిత్యాల జిల్లా : దీంతో రైతు అత్యంత చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి కుట్టిన పామును గమనించాడు…

అక్కడే ఉన్న ఆ విష సర్పాన్ని శ్రీనివాస్ చంపి చికిత్సా కోసం చంపిన సర్పంతో సహా…

జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు….

సర్పం కాటు వేసిన క్షతగాత్రున్ని పరీక్షించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ..

అత్యవసర వైద్యాన్ని అందించారు..

ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు….


SAKSHITHA NEWS