గొట్ట బ్యారేజ్ లో రేపు సాగునీరు విడుదల barrage
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు
శ్రీకాకుళం / నరసన్నపేట:
గొట్ట బ్యారేజ్ లో ఉదయం సాగునీరు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రి అచ్చెంనాయుడు మాట్లాడుతూ ఈ బాధ్యతలను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు స్వీకరించి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు ప్రస్తుతం బ్యారేజ్ లో 2000 టీఎంసీల వాటర్ ఉందని అధికారులు ఆయనకు తెలియజేశారు.
వంశధార కాలువలకు ఆనుకుని ఉన్న పిల్ల కాలువలను వెంటనే పరిశుభ్రం చేయాలని మంత్రి అచ్చం నాయుడు ఆదేశించారు ఈ పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వీటిని ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు దీనిపై పిడి చిట్టి రాజు మాట్లాడుతూ ఇప్పటికే 1386 పిల్ల కాలువలను గుర్తించడం జరిగిందని ఇప్పటికే చాలా వరకు పిల్ల కాలువలను పరిశుభ్రం చేయడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
![గొట్ట బ్యారేజ్ లో సాగునీరు విడుదలbarrage 2 barrage](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-11.03.53.jpeg)