SAKSHITHA NEWS

యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం

మల్కాజిగిరి

యాదవ్స్ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభా చాటిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మనిషా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభా చాటుకున్న 250 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించి సర్టిఫికెట్ తో పాటు మెమొంటోని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాకుడు అల్లాడి శరత్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి యాదవ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతిఏటా విద్యలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి సన్మానిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, జంగాల శ్రీరామ్ యాదవ్, అయోధ్య రామ్, శ్రీకాంత్ యాదవ్, యాదవ్, సునీత,సిద్దేశ్వర యాదవ్, టీ.శివ కుమార్ యాదవ్,జితేందర్ యాదవ్,జయ లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS