SAKSHITHA NEWS

BRS party office was demolished as part of the party's action

కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత ..అధికారుల కక్ష సాధింపు చర్యల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

ఇందిరా నగర్ లో అవసం ఉండే ప్రతి ఒక్కరి బాగు కోసం పాటు పడే BRS పార్టీ నాయకులు మీద కక్ష సాధింపు చర్యల లో భాగంగా అధికారులు పార్టీ కార్యాలయం కూల్చివేశారు..

బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన బస్తివాసులు గత కొన్ని సంవత్సరాలుగా పొట్టకూటికోసం రోడ్డు పక్కన షెడ్లు తీసుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు

హఠాత్తుగా రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు .. పోలీస్ సిబ్బందిని తీసుకొని వచ్చి నిరుపేదల చిరు వ్యాపారాలపై నిర్దాక్షిణ్యంగా విరుచుక పడ్డారు.
పేదలు ఎంత ప్రాధేయ పడుతున్న వినకుండా ప్రతి షెడ్యూల్ నేలమట్టం చేసి పేదల కడుపు మీద కొట్టారు.

సంఘటన స్థలం కు చేరుకున్న డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ
పది సంవత్సరాల కాలంలో పేదలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల పొట్ట మీద కొట్టి దారుణం సృష్టించిందని ఇలాంటి చర్యలు సరికాదని .. పేదల మీద ఇలా విరుచుకుపడితే పేదవాళ్లతో కలిసి పోరాడుతా


SAKSHITHA NEWS