ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచిన
స్ట్రాంగ్ రూమ్స్ నలువైపులా కేంద్ర పోలీస్ బలగాలు, జిల్లా ఆర్మ్ డ్ పోలీస్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతతో పాటు నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన రక్షణ వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు లేకుండా పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ… సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సిఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…