SAKSHITHA NEWS

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి
పాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డయామర్ జిల్లాలోని కారకోరం హైవే వద్దకు రాగానే.. అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు


SAKSHITHA NEWS