పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి

Spread the love

మల్టీజోన్-2 ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సుధీర్ బాబు బుధవారం రోజున సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా సోషల్ మీడియాపై దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కర్ణాటక మరియు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది కాబట్టి అక్రమ మద్యం అక్రమ నగదు రవాణా లేకుండా సరిహద్దుల్లో గట్టి భద్రత మరియు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

అలాగే ఎవరైనా సరే ఆశాంఘిక శక్తులు సోషల్ మీడియా లేక వేరే రూపంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడిన లేక పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో మల్టీజోన్-2 ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సుధీర్ బాబు సంగారెడ్డి జిల్లా ఎస్పి సి.హెచ్ రూపేష్ పోలీస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page