దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత

Spread the love

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్‌ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో సాయంత్రం కవిత భర్త అనిల్‌కుమార్‌, సోదరుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. తొలి రోజైన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  కవితను ఈడీ విచారించింది. విచారణ ముగిసిన తర్వాత ఆమెను కలవడానికి కుటుంబసభ్యులకు అధికారులు అవకాశం ఇచ్చారు.  ఈడీ కార్యాలయం వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా వచ్చినా.. వారు బయటే ఉండిపోయారు. కవితను కలిసిన తర్వాత కుటుంబసభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు.

Related Posts

You cannot copy content of this page