రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడి గా చింపుల సత్యనారాయణ రెడ్డి

Spread the love

సాక్షిత చేవెళ్ల: రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డికి స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పీసీబీ చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతకుమారిని నియమించగా, స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి సభ్యునిగా రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పీసీబీ సభ్యులుగా 15 మందిని నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ పీసీబీ మండలి సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీమ్ భరత్.. సత్యనారాయణ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భీమ్ భరత్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ వారికి కచ్చితంగా పదవులు వస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఎజాస్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ శేరి అనంత్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, కృష్ణారెడ్డి, మల్లికార్జున్, శ్రీకాంత్, మధు, నర్సింలు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page