SAKSHITHA NEWS

బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కాంగ్రెస్లో చేరారు. దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు గులాబీ నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌ రెండోరోజు దిల్లీ పర్యటనలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్‌ ఇంటికి రేవంత్‌ రెడ్డితో కలిసి వెళ్లిన ఎంపీ వెంకటేశ్ నేత ఇరువురి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.


SAKSHITHA NEWS