SAKSHITHA NEWS

మెహిదీపట్నం: ‘మా గవర్నమెంటులో మమ్మల్నే ఆపుతావా రా బై నువ్వు…’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సౌత్ వెస్ట్ జోన్ డిసిపి సాయి చైతన్యపై తీవస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం ఉదయం ఆయన లంగర్ హౌస్‌లోని బాపుఘాట్‌లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చారు. అంతకుముందు ఆయన మహాత్మా గాంధీ సమాధి వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు పెరిక రాజుతో పాటు పరమానందంతో మరో వ్యక్తి అక్కడికి వచ్చారు.

వారిని డీసీపీ సాయి చైతన్య లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు విహెచ్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు.. వెంటనే పోలీసుల వద్దకు చేరుకున్న వీహెచ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గవర్నమెంటులో మమ్మల్ని ఆపుతావా రా భాయ్ నువ్వు.. అంటూ సౌత్ వెస్ట్ జోన్ డిసిపి సాయి చైతన్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో విహెచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత అర్ధగంట తర్వాత పోలీసులకు ఫోన్ రావడంతో వారిని లోపలికి అనుమతించారు.

Whatsapp Image 2024 01 30 At 1.31.34 Pm

SAKSHITHA NEWS