SAKSHITHA NEWS

పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో భారతి నగర్ డివిజన్ యందు స్వామి వివేకనంద యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటుచేసిన వివేకానంద 161 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి శ్రీ గోదావరి అంజిరెడ్డి..ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని ఆయన చేసిన దేశ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి .రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ రామచంద్రపురం సిఐ నరేందర్ రెడ్డి ఎస్సై శశిధర్ ఆర్ఎస్ఎస్ నాయకులు శంకర్ మరియు రవీంద్ర చారి స్వామీజీలు గారు నంద రెడ్డి మరియు రామచంద్రపురం భారతీ నగర్ డివిజన్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 12 At 1.51.40 Pm

SAKSHITHA NEWS