SAKSHITHA NEWS

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు
▪️ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం రాంరెడ్డి బావి గ్రామం ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ రవీందర్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకాంత్ గౌడ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చంద్రారెడ్డి, నాయకులు డి హర్షవర్ధన్ రెడ్డి, యాదిరెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, నవీన్ రెడ్డి కాంగ్రెస్ లో కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలువబోతుందని, మహిపాల్ రెడ్డి అహంకారాన్ని ప్రజలు తమ ఓటు తో బుద్ది చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబెర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి , మండల్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, ట్రెజరర్ మహిపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బాలకృష్ణ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ దయాకర్ రెడ్డి, శంకర్, గ్రామ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి చంద్రారెడ్డి, యూత్ ప్రెసిడెంట్ రాజు, హరి వర్మ పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 17 At 1.00.26 Pm

SAKSHITHA NEWS