SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ స్థాయి కమిటీ సన్నాహక సమావేశం జరిగింది. నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులూ టీపీసీసీ ప్రతినిధి కొలన్. హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలు, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు సహా ఇతర హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించారు.

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు కొలన్. హన్మంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలు, ప్రచార సమావేశాలు వంటివి సోషల్ మీడియాలో వెంటనే అప్లోడ్ చేసేలా ప్రతి ఒక్కరు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. బూత్‌ల వారీగా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు కాంగ్రెస్ హామీలు, పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ గెలుపుకు శాయశక్తులా శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, NSUI నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, INTUC నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS