SAKSHITHA NEWS

కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా, వారు తెలంగాణకు అందించిన సేవలను, చేసిన త్యాగాలను స్మరించిన ఎమ్మెల్యే కే ప్ వివేకానంద్…..

*సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట లో కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే కె పి వివేకానంద్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, సంక్షేమ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS