మన ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి

Spread the love

మన ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతిని ఘనంగా నిర్వహించు కుందాం!
తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష


సాక్షిత : ఉదయం బాలాజీ కాలనీ కూడలిలో మహాత్మ జ్యోతిరావు గోవిందరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష.
మనం ఆనందంగా స్వేచ్ఛగా విలాసమైన జీవితాలు గడుపుతున్నామని అంటే పుణ్యాత్ముని త్యాగఫలమే,బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి పోరాటయోధుడు, అనగారిన వర్గాల వీరుడు ఆనాడు చైతన్య మైనటు వంటి మహాపురుషుడు విజ్ఞాన వంతుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఇలాంటి మహనీయులు మనకు ఎంతో ముందుచూపుతో చదువు మనిషికి మహోన్నతమైన శక్తినిస్తుందని గ్రహించి
అనగారిన వర్గాలకు విద్యను అందించడమే ధ్యేయంగా తన జీవిత లక్ష్యంగా మహాత్మ జ్యోతిరావు పూలే, భార్య సావిత్రిబాయి పూలేను కూడ విద్యావంతురాలుగా తయారుచేసి ఆమె కూడా మోట్ట మొదటి ఉపాధ్యాయులుగా తయారు చేసిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే దే కనుక జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మేయర్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page