SAKSHITHA NEWS

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 10 లో అక్తర్ బేగం సయ్యద్ అనే ఆమె ఇద్దరి కుమారులతో నివసిస్తున్నారు. మొన్న శనివారం రోజున ప్రమాదవశాత్తు వారి ఇల్లు దగ్దమై ఇంటిలోని సామాన్లు, ఫర్నిచర్, బట్టలు అన్ని కాలిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారిని పరామర్శించి, నెలరోజులకూ సరిపడిన నిత్యావసర సరుకులు మరియు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, ఖాజా, బాలస్వామి, యాదగిరి, అరుణ, సలీమ్, రవీందర్, రాజు, వంశీగౌడ్, అంజద్, అబ్బాస్, చోటు, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS