SAKSHITHA NEWS

వెన్నెల గడ్డ చెరువు వద్ద పూర్తి కావస్తున్న ఎస్టీపీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ‘తెలంగాణ మంచినీళ్ళ పండుగ‘ను నిర్వహిస్తున్న నేపథ్యంలో చెరువులు కలుషితం కాకుండా వంద శాతం మురుగునీటిని శుద్దీకరించాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.248 కోట్లతో చేపడుతున్న 5 ఎస్టీపీల నిర్మాణ పనుల్లో భాగంగా జీడిమెట్ల వెన్నెల గడ్డ వద్ద రూ.21.87 కోట్లతో 10 MLD సామర్ధ్యం గల ఎస్టీపీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పరిశీలించారు. దాదాపు 70% పనులు పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం (ఎస్టీపీ) తిప్పన్న, జీఎం శ్రీధర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంఛార్జి శ్యామ్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS