1కోటి51 లక్షల రూపాయలతో..పలు యూజీడి పైప్లైన్లు.. పలు సీసీ రోడ్లు పునరుద్ధరణ పనులకు శంకు స్థాపన

Spread the love

సాక్షిత : ఫతేనగర్ డివిజన్లోని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్..పలు అభివృద్ధి కార్యక్రమాలకు 1కోటి51 లక్షల రూపాయలతో..పలు యూజీడి పైప్లైన్లు.. పలు సీసీ రోడ్లు పునరుద్ధరణ పనులకు శంకు స్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూనే ఉందని.. భవిష్యత్తులో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా మారుస్తున్నామని.. అందుకే ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకుని ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నామని అన్నారు.. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ మహానగరంలో ఇకనుండి మంచినీటి సమస్య గాని ..డ్రైనేజ్ సమస్య గాని రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు..అందుకు అనుగుణంగానే నూతన పైపులైన్ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు..

Related Posts

You cannot copy content of this page