జడ్జి రాజగోపాల్ కి శుభాకాంక్షలు తెలిపిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

Spread the love

జడ్జి రాజగోపాల్ కి శుభాకాంక్షలు తెలిపిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

— ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తి గౌతం ప్రసాద్ సన్మానించి యస్.పి, డీఎస్పీలు

సూర్యాపేట సాక్షిత ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజగోపాల్ ని యస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ జిల్లా కోర్టు నందు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు క్యాలండర్, న్యాయశాఖ, పోలీసు శాఖ సమన్వయం, శిక్షల అమలు మొదలగు అంశాల గురించి ఇరువురు చర్చించారు. పోలీసు పని విధానం, ఎన్ఫోర్స్మెంట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని జడ్జి కి తెలిపారు. కేసుల నమోదు, నేర అభియోగ పత్రాలను సకాలంలో కోర్టుకు అందజేస్తున్నామని, సాక్షులను, బాధితులను, నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరుస్తున్నామని జడ్జికి వివరించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ సమన్వయం తో పని చేయాలని జడ్జి ఈ సందర్భంగా యస్.పి ని కోరారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన జిల్లా జడ్జి గౌతం ప్రసాద్ ని జిల్లా పోలీసు శాఖ తరపున యస్.పి సన్మానించారు. జిల్లా కోర్టుకు జడ్జిగా జిల్లాలో సుదీర్ఘకాలం సేవలు అందించారని కొనియాడారు.ఈకార్యక్రమంలో డిఎస్పీ లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, డిసిఆర్పీ డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కోర్టు లైజన్ ఆఫీసర్స్, సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page