Young woman committed suicide three months after marriage
పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య
పెళ్లైన మూడు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈర్ల రమేష్, రమ దంపతుల కూతురు వైష్ణవి(26)ని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రెడ్డి ప్రశాంత్ తో 3 నెలల క్రితం వివాహం జరిపించారు. పుట్టింటికి వచ్చిన వైష్ణవి తెల్లవారుజామున ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
![పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య 2 WhatsApp Image 2024 06 19 at 12.17.56](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-12.17.56.jpeg)