నా బలం.. అండ మీరే

Spread the love

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

……..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాకు బలం.. అండ కార్యకర్తలు, నాయకులేనని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంటరీ స్థాయి సన్నాహాక స్థాయి సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మళ్లీ చరిత్ర పునరావృతం అవడం ఖాయమని, భారీ మెజార్టీ తో తన గెలుపు తధ్యమని నామ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా పని చేయడం వల్ల 1 లక్షా 62 వేల మెజార్టీ పైగా సాధించి, ఘన విజయం సాధింఛానని గుర్తు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చరిత్ర పునరావృతం అయ్యేలా మెజార్టీ వస్తుందని అన్నారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండాలని కేసీఆర్ తనను పార్లమెంట్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారని చెప్పారు.

కార్యకర్తలు, నాయకుల అండ, బలం చూసుకునే బరిలో నిలిచానని అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణా బిల్లు సందర్భంగా మొదటి ఓటు తానే వేసి, సమర్ధించానని అన్నారు. ఖమ్మం జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు పై అవిశ్రాంతంగా పోరాడనని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల వెనుక తన సుదీర్ఘ పోరాటం ఎంతో ఉందని నామ పేర్కొన్నారు. అండగా ఉండి మంచి మెజార్టీతో గెలిపించాలని నామ నాగేశ్వరరావు కోరారు.

Related Posts

You cannot copy content of this page