భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

Spread the love

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు
మంత్రులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు


*సాక్షిత * : భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా భద్రాద్రి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి గర్భగుడిలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలసి పూజలు చేశారు. స్వామి వారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పండుతులు వేద ఆశీర్వచనం స్వామి వారి ప్రసాదం అందజేశారు. దేవస్థానం ఈవో రమాదేవి స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్, డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page