SAKSHITHA NEWS

సమస్యల పరిష్కారం కోసం కృషి
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ 22వ వార్డు జీఎల్ఎస్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

మౌళిక వసతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట్ హన్మంతరావు, అసోసియేషన్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS