SAKSHITHA NEWS

ఇచ్చిన మాట ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం
సాక్షిత : పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి గుమ్మడిదల మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం కొరకు ఇచ్చిన మాట ప్రకారం 24లక్షల 50 వేల రూపాయలు తన సొంత నిధులతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం చేయించి ఇచ్చినారు.

గుమ్మడిదల మండలంలో వెనుకబడిన గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి సొంతమని, సొంతంగా 24 లక్షల 50 వేలు రూపాయలు నగదు ఇచ్చి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మించి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి గుమ్మడిదల మండల రైతుల తరఫున ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి జెడ్పిటిసి చిన్న పాపాని కుమార్ గౌడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ సహకార సంఘం చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి జడ్పిటిసి కుమార్ గౌడ్ సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు హుస్సేన్ గుమ్మడిదల సర్పంచ్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి స్థానిక వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి జైపాల్ రెడ్డి ఆకుల సత్యనారాయణ ఆంజనేయులు కోపరేటివ్ డైరెక్టర్ మద్దుల బాల్ రెడ్డి చిమ్ముల దేవేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులు కర్ణాకర్ గౌడ్ తుడుం శీను తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS