సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపిన వివోఏలు

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

తెలంగాణ ఐకెపి వి ఓ ఎ లు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండలంలోని వివోఏలు గత ఎనిమిది రోజుల నుండి నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా 8వ రోజు దీక్షలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష కార్యదర్శులు ఎదుల్ల లక్ష్మి, గుడిసె సువర్ణ లు మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం తీసుకొస్తూ సంఘాలుగా ఏర్పర్చి రుణాలు ఇప్పిస్తూ ప్రభుత్వ పథకాలను సంఘాలకు అందేలా చూస్తున్నామని. ప్రభుత్వ సర్వేలు కూడా చేస్తూన్నామని అయినా ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందని కేవలం 3900 వేతనం ఇస్తున్నారని. మమ్మల్ని సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం 26వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పలు డిమాండ్లతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page