SAKSHITHA NEWS

శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో గల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త శాలిని శేఖర్ గౌడ్ అన్నారు. వారు స్వామివారికి ఆలయ పూజారులు సాయి శివ, ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు వారు స్వీకరించారు. శాలిని శేఖర్ గౌడ్ మాట్లాడుతూ 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఎంతో మహిమ కలిగినదని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సదానందం గౌడ్.. శాలిని శేఖర్ గౌడ్ లకు స్వామి వారి చిత్రపటం బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివ ఉన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Whatsapp Image 2023 12 08 At 4.59.25 Pm

SAKSHITHA NEWS