రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని 40 ఫీట్స్ రోడ్డులో డ్రైనేజీ సమస్యగా ఉందని కాలనీ ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని నలభై ఫీట్ల రోడ్డులో గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ చిన్నగా ఉండడంతో నిత్యం నిండిపోయి ప్రజాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీలో నివాసాలు పెరిగినందున ప్రజల అవసరాల దృష్ట్యా పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, CH. భాస్కర్, ఇంతియాజ్, ఖాజా, మహేష్, వెంకటేష్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page