వీర హనుమాన్ విజయ యాత్ర కర పత్ర ఆవిష్కరణ

Spread the love

వీర హనుమాన్ విజయ యాత్ర కర పత్ర ఆవిష్కరణ

ఏప్రిల్ 6 గురువారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ వరంగల్ జిల్లా కన్వీనర్ మల్యాల రవి మాట్లాడుతూ శోభ యాత్ర నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయం నుండి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం తో ప్రారంభంమై సర్వాపురం హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ హారతి తో ముగుస్తుంది కావున వీర హనుమాన్ శోభ యాత్ర లో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని పవనసుత హనుమాన్ అనుగ్రహం పొంది శోభ యాత్రని విజయవంతం చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ నర్సంపేట డివిజన్ ఉప అధ్యక్షులు చోల్లేటి జగదీశ్వర్ హనుమాన్ గురుస్వామి సారంగపాని రాజిరెడ్డి అఖిల్ తదితర హనుమాన్ భక్తులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page