వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ వారి అభినందన సభ

Spread the love

వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ వారి అభినందన సభ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ఇండస్ట్రీ పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ లోని కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించి వారి వేతనాన్ని 10000 పెంపొందించినందుకు ఈ రోజు 129 సూరారం డివిజన్ పరిధిలోని నల్లగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంప్లాయిస్ యూనియన్ వారు ఏర్పాటుచేసిన అభినందన సభ కారిక్రమానికి ముఖ్య అదితిగా విచ్చేసిన యూనియన్ అధ్యక్షులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కార్మిక శ్రేయసకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని తెలిపారు. కార్మిక పక్షపాతి గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారు అని తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్న మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మూర్తి రాజు, ఎచ్ఆర్ సుబ్బారావు, ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ రాజి రెడ్డి, శ్రీనివాస్, ఉమా మహేశ్వర్ రావు, బిఆర్ఎస్ పార్టీ నియోజికవర్గ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, సీనియర్ నాయకులూ ఇంద్రసేనా గుప్త, మఖ్సూద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page