పఠాన్ చెరువు ఎమ్మెల్యే రెడ్డికి వంశీ పరామర్శ…గన్నవరం

Spread the love

తెలంగాణ రాష్ట్రంలోని పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జులై 23 న ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. కామెర్లకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 27న మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ


మహిపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేయడంతో పాటు స్టూడెంట్స్ ఉద్యమంలో ముందుండి పనిచేసేవారని వంశీ గుర్తు చేశారు. అటువంటి యువ నాయకుడు లేకపోవడం పార్టీ కి, విష్ణువర్ధన్ రెడ్డికి తీరని లోటు అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page