హరిహర కళాభవన్ లో ఉగాది జాతీయ బంగారు నంది అవార్డు ఉత్సవాలు

Spread the love

హరిహర కళాభవన్ లో ఉగాది జాతీయ బంగారు నంది అవార్డు ఉత్సవాలు

సికింద్రాబాద్ సాక్షిత ఏప్రిల్ 16 సికింద్రాబాద్ లో జిసిఎస్ వారి సౌజన్యతో వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది జాతీయ బంగారు నంది అవార్డుల ఉత్సవాలు సికింద్రాబాద్ హరిహర కళాభవనలో తెలుగు భాష అవార్డ్స్ ప్రధాన ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి నంది అవార్డ్స్ ను ఇతర పురస్కారాలను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు భాష సంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, సంఖ్యా శాస్త్రాన్ని నిపుణులు దైవజ్ఞ శర్మ, నటుడు కిరణ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏలూరు జిల్లా కలెక్టర్ మోహన రాఘవ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో పెద్దాపురం కు చెందిన చింతా గోపి శర్మ, కాకినాడకు చెందిన దేవర బొట్ల భవానీ ప్రసాద్, రాజమండ్రి కి చెందిన ప్రకాష్ శర్మ, అవనిగడ్డ కు చెందిన కవిత ఫణి శర్మ సిద్ధాంతి,తదితరులు అవార్డులు అందుకున్నారు.

Related Posts

You cannot copy content of this page