అఖిలాండ నాయకుని ఉగాది అలంకరణ…

Spread the love

అద్భుత అలంకరణలకు నిలయం అయిన మల్కాజ్ గిరి లో గల ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు…

స్వామివారు ఉగాది పచ్చడి మేళవింపుల కలయిక అయినటువంటి తీపి.. పులుపు.. చేదు.. వగరులకు సంబంధించిన అన్ని వనరులను తనకు అలంకరణగా చేసుకొని భక్తులకు దర్శనమిచ్చారు…

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ… భక్తులందరికీ స్వామివారి సంపూర్ణ కరుణాకటాక్షాలు కలగాలని …ఈ సంవత్సరం వారి యొక్క ఈతి బాధలు అన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో ఉండాలని.. దేశం మొత్తం సస్యశ్యామలంగా విరాజిల్లాలని .. వారు అన్నారు…

Related Posts

You cannot copy content of this page