SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చింతకాని మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కిష్టాపురం, రామకృష్ణాపురం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలలో జరిగిన పలు శుభకార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డాక్టర్ కోట రాంబాబు, కన్నెబోయిన సీతారామయ్య, కిలారు మనోహర్, ఎల్. హనుమంతరావు, బూరుగడ్డ లక్ష్మీనారాయణ, గుడిపాటి ఆనందరావు, కోలేటి సూర్యప్రకాష్ రావు, వలమల నాగేశ్వరరావు, కన్నెబోయిన కుటుంబరావు, రవీందర్ రెడ్డి, శెట్టి మోహన్ రావు, పిన్నెల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS