SAKSHITHA NEWS

MINISTER మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
మంత్రికి గణ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు

సాక్షిత పాడేరు :
శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా గుమ్మడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆమెకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు పొలుపార్తి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి కి అమ్మవారి పాదాలలో ఘన స్వాగతం పలకరు. పాదాల వద్ద అమ్మవారి దర్శించుకుని అక్కడి నుండి నేరుగా పాడేరులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు నాయకులు దుస్సాల్వా, పూల బొక్కేయలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుండి నేరుగా అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గంజాయి నిర్మూలన పై జరిగిన సమీక్ష సమావేశానికి పాల్గొన్నారు.

MINISTER

SAKSHITHA NEWS