శ్రీ గణేష్ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

Spread the love

విజ్ఞనాధుడి నిమర్జన శోభాయాత్రలో పాల్గొన్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్.


వైరా

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా పట్టణ పరిధిలోని 12వ వార్డు మరియు 4వ వార్డు నందు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గజానన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ .
మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు .

ఈ సందర్భంగా 12వ వార్డు నందు ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ విజ్ఞనాధుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వైరా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వేడుకున్నారు.అనంతరం స్వామివారి ప్రసాదాన్ని గ్రామ ప్రజలకు వడ్డించారు.

అదేవిధంగా 4వ వార్డు నందు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ గ్రామ ప్రజలకు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు గణేష్ నిమర్జన సమయంలో చిన్నపిల్లలను నీటి ప్రాంతాలకు దూరంగా ఉంచాలని, ప్రశాంతమైన వాతావరణంలో నిమర్జనం వేడుకలు నిర్వహించాలని తగు సూచనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైరా మత్స్యశాఖ డైరెక్టర్ గుడిమల్ల రత్తయ్య,కట్ల నాగరాజు,వెంపటి రంగారావు,కట్ల సంతోష్, కట్ల శ్రీకాంత్,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు నుండ్రు నాగరాజు, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి పానం భాస్కర్, ఐ ఎన్ టి యు సి వైర మండల అధ్యక్షులు వీరబాబు, కంభంపాటి సత్యనారాయణ, ఆకుల అప్పారావు,రేచర్ల పుల్లయ్య రేచర్ల నాగేశ్వరరావు, రేచర్ల విశ్వనాథం, యామల భాస్కరరావు, యామాల కిరణ్, రేచర్ల యూత్, రాజేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page