SAKSHITHA NEWS

నేడు మహనీయులు దివంగత కేఎం పాండు 78వ జయంతి…

కుత్బుల్లాపూర్ లో కేఎం పాండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే…

*సాక్షిత : కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు స్వర్గీయ కేఎం పాండు 78వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజెన్స్ హాల్ వద్ద ఉన్న కేఎం పాండు విగ్రహానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేఎం పాండు చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్స్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS