SAKSHITHA NEWS

వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన వికలాంగుల పొదుపు సంఘంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రూ.1.60 లక్ష రూపాయల రుణాలు రెండు గ్రూపులకు మంజూరు అయ్యాయి. ఈ మేరకు అందుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని పొదుపు సంఘం సభ్యుడు బీసు వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చేతుల మీదుగా చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఓ పాపన్న గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, నియోజకవర్గ యూత్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు మారయ్య, సురేందర్ రెడ్డి, సిద్ధిక్, మధుగౌడ్, అనిల్ కుమార్, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS