తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పదవీ ప్రమాణం చేసి, బాధ్యతలు

Spread the love

సాక్షిత : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ గా నియమితులైన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పదవీ ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించిన వేళ వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

తిరుమలలోని గరుడ అల్వార్ సన్నిధిలో టిటిడి చైర్మన్ గా పదవీ బాధ్యతలను చేపట్టిన భూమున కరుణాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి మురళీకృష్ణ దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతకు ముందు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య సన్నిధిలో రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు అంబటి రాంబాబుతో కలసి శ్రీ వారి దర్శనం చేసుకున్నారు వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీ కృష్ణ.

Related Posts

You cannot copy content of this page