ఎందరో మహనీయుల పోరాట ఫలితమే ఈ ఆవిర్భావ వేడుక

Spread the love

ఎందరో మహనీయుల పోరాట ఫలితమే ఈ ఆవిర్భావ వేడుక

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని చిట్యాల మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు కూరేళ్ల శ్రీను ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఎందరో కార్యకర్తల, నాయకుల త్యాగాల వల్లే ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ గా గుర్తింపు పొందిందని వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త రానున్న ఎన్నికల్లో గోల్కొండ కోట పై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా పార్టీ అభివృద్ధి కి తెలంగాణ రాష్ట్రం లో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలన నుండి విముక్తి కోసం తెలంగాణ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవినీతి అంతమొందించడానికి కొనసాగుతున్న ఈ పోరాటం లో నేను భాగస్వామి ని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నానని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కోళ్ల స్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శులు గంజి గోవర్ధన్,
నాయకులు మల్లేష్, కన్నేబోయిన మహాలింగం, చికిలం మెట్ల అశోక్, జిట్టా కృష్ణ,ఇమ్మడి విజయ్, కుక్కల నాగరాజు జిట్టా విష్ణు, నరేష్, నవీన్, పాల శివ,పురం ప్రశాంత్, తీగల శివ, మాస నరేష్ ,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page