SAKSHITHA NEWS

చిన్న రోడ్డు ప్రమాదంతో ప్రారంభమైన గొడవ ప్రాణం తీసే వరకు వెళ్ళింది.

వికారాబాద్ జిల్లా కొత్తగాడి సమీపంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది మోమిన్ పెట్ మండలం మల్ రెడ్డి గూడా కు చెందిన అభిలాష్ 22 ఏజ్ బీటెక్ బెంగళూరులో చదువుతున్నాడు గ్రామానికి స్కూటీపై వెళ్తున్న సమయంలో ముందు నుంచి వస్తున్న ప్రవీణ్ అనే యువకుడు రెండు బైకులు ఢీకొన్నాయి అభిలాష్ మరియు ప్రవీణ్ ఇద్దరికీ స్వల్ప గాయాలు అయినాయి ఆగ్రహానికి గురైన ప్రవీణ్ అభిలాష్ పై దాడి చేశాడు చేసిన తర్వాత ప్రవీణ్ తన వికారాబాద్ లో ఉన్న కొంతమంది స్నేహితుల కు పిలిపించి మరి దారుణంగా అభిలాష్ ని కొట్టడం జరిగింది దాడి సమయంలో అభిలాష్ ప్రవీణ్ కు కొత్త బైక్ ఇప్పిస్తానని వేడుకున్న చెప్పినా కూడా వినకుండా మానవత్వం మరిచి క్రూరంగా దాడి కు పాల్పడ్డారు దెబ్బలకు భరించలేక యువకుడు అభిలాష్ బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసుల ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడు బెంగళూరులోని గౌతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు.


SAKSHITHA NEWS