గొర్రెల పంపిణీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

గొర్రెల పంపిణీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో బంట్వారం మండల పరిధిలోని బొపునారం గ్రామానికి చెందిన 12 మంది గొల్ల, కురుమ సోదరులకు 15.75 లక్షల సబ్సిడీ తో 252 గొర్రెలను పంపిణి చేశారు.
గ్రామాలలో పశుసంపద నిండుగా ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనే సదుద్దేశంతో గొల్ల, కురుమ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణమైనటువంటి సంక్షేమ పథకాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page