ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలన్ని పరిష్కరించి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని

Spread the love

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలన్ని పరిష్కరించి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. సోమవారం సనత్ నగర్ లోని అశోక్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలను మంత్రులు సందర్శించి పాఠశాలలోని సమస్యలు, ఇబ్బందుల గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈ పాఠశాలను సందర్శించిన సందర్బంగా పలు అంశాలను సిబ్బంది, విద్యార్ధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రి 2, 3 రోజులలో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కలిసి పాఠశాలలను సందర్శించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యాశాఖ ఆర్జేడి విజయలక్ష్మి, జేడి ప్రసాద్, అదనపు కలెక్టర్ అభిషేక్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి లతో కలిసి పాఠశాలలను సందర్శించారు.

ఈ పాఠశాలలోనే తెలుగు, ఉర్దూ మీడియం ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ సందర్బంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ తమకు వడ్డించే మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండటంలేదని, దాంతో తమ ఇంటి వద్దనుండే బోజనాలు తెచ్చుకుంటున్నామని వివరించారు. రుచికరమైన, నాణ్యమైన బోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా టాయిలెట్స్ సరిగా లేవని, నీటి కొరత ఉన్నదని, పర్నిచర్ కూడా లేదని, సిబ్బంది కొరత ఉన్నదని, స్వీపర్లు లేకపోవడం వలన పాఠశాల పరిశుభ్రత సక్రమంగా ఉండటం లేదని మంత్రుల దృష్టికి విద్యార్ధులు తీసుకు రాగా, వారం 10 రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.

సిబ్బంది అదనంగా ఉన్న పాఠశాల నుండి అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్ పై ఇక్కడ నియమించాలని అక్కడికక్కడే మంత్రి అధికారులను ఆదేశించారు. పాఠశాలల లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను GHMC సిబ్బంది చేపడతారని, పర్యవేక్షించాలని అక్కడే ఉన్న AMOH డాక్టర్ భార్గవ్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన మన బస్తీ మన బడి కార్యక్రమం 2 వ విడత లో ఈ పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్, టాయిలెట్స్ నిర్మాణం వంటి అన్ని పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. విద్యార్ధులకు వడ్డించే భోజనం సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించాల్సిన బాద్యత పాఠశాలల సిబ్బంది పై ఉన్నదని మంత్రి గుర్తుచేశారు.

విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సమస్యలను తెలుసుకొని పేరెంట్స్ కమిటీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. దాతల సహకారంతో పాఠశాలలో CC కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి 7 లక్షల మందికి విద్యను అందించడం జరుగుతుందని చెప్పారు. ఒక్కో విద్యార్ధి కోసం సంవత్సరానికి ఒక లక్ష 20 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే విద్యార్ధులకు సన్న బియ్యం తో నాణ్యమైన, రుచికరమైన బోజనాన్ని విద్యార్ధులకు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, ప్రదానోపాద్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, MEO ఆంజనేయులు, వాటర్ వర్క్స్ GM హరి శంకర్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page