పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది

Spread the love

సాక్షిత : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అతిపెద్ద పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది. గత 48 రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక దఫాలుగా కార్మిక సంఘం అధ్యక్షులు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మరియు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల మధ్య కార్మికుల యొక్క కష్టాలు, వేతనాల పెంపు డిమాండ్లు చర్చించారు. చివరకు ఎనామిల్ పలకల పరిశ్రమ యాజమాన్యం కార్మికుల యొక్క వేతన పెంపు మరియు డిమాండ్లను ఆమోదించడంలో సమ్మె ముగిసినది.

కావున వర్కర్స్ అందరూ రేపటి నుంచి తమ విధులకు హాజరు కావాలని కార్మిక సంఘం అధ్యక్షులు ఇమ్మడి కాశీనాధ్ కోరారు. ఈ చర్చల్లో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page