SAKSHITHA NEWS

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్య మందిరంలో ప్రాణప్రతిష్ట సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఉప్పల్ బాగ్ ఆధ్వర్యంలో అక్షింతల వితరణ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కి పూజిత అక్షితలను వారు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మంని,హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిని.500 సంవత్సరాల కల నెరవేరబోతుందని.దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్ల మన మన అందరి కల నెరవేరబోతుందని ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఈ జన్మలో భవ్య రాముని నిర్మాణము జరుగుతుందని. కావున రాష్ట్ర ప్రభుత్వం 22న సెలవు దినముగా ప్రకటించాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సినీ సర్టిఫికేషన్ నెంబర్ మైపాల్ రెడ్డి, ముక్తేశ్వర్ రెడ్డి ఉప్పల్ బాగ్ సెక్రెటరీ, సురేష్ రెడ్డి ఉప్పల్ బాగ్ ఉపాధ్యక్షులు, రమేష్ రెడ్డి బోడుప్పల్ అధ్యక్షులు, సభ్యులు పటి మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 20 At 1.05.46 Pm

SAKSHITHA NEWS