SAKSHITHA NEWS

ఘనంగా పైడితల్లి అమ్మవారి ప్రతిష్ట

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బుడుమూరు పంచాయతీ కలిశెట్టి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది.హోమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,పూజానంతరం శుభ ముహూర్తాన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్థానికులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.


SAKSHITHA NEWS